తెలంగాణ రాష్ర్టంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యింది. 24 ఏళ్ల యువతి మిస్సింగ్పై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందాపూర్ కు చెందిన యువతి మిస్సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి చిన్నాన్న ఫిర్యాదుపై కేసు దర్యాప్తు ప్రారంభించారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్ సీపీ అభినందించారు.