నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్ మృతి చెందారు. భర్త లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది.