ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ కిట్ల పేరిట వందల కోట్ల నిధులు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు డైరెక్టర్ దేవికారాణి, ఇతర సూత్రధారుల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, 2017-18లో మెడికల్ కిట్ల పేరుతో 60కోట్ల మేర గోల్ మాల్ జరగగా, హెచ్ఐవీ కిట్ల పేరుతో మరో కోటీ 76 లక్షలు మాయం చేసినట్లు గుర్తించారు. దాంతో, డైరెక్టర్ దేవికారాణి, ఇతర సిబ్బంది పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.