దిశా అత్యాచార నిందితుడు చెన్నకేశవులు భార్యకు ఆడపిల్ల!

Update: 2020-03-07 01:46 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య ఆడబిద్దకి జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో  గురువారం ఆమెకు ఆడపిల్ల పుట్టింది. హైదరాబాద్ శివార్లలో దిశ పై అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంఘటనలో చెన్నకేశవులు ఏ2 నిందితుడు. ఆ కేసు విచారంలో భాగంగా జరిగిన ఎన్కౌంటర్ లో గత డిసెంబర్ లో చెన్నకేశవులు మరణించాడు. ఆ సమయానికి అతని భార్య ఆరు నెలల గర్భవతి.

చెన్నకేశవులు విషయంలో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందినా వాడు. ఇతను అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పోలీసుల విచారణలో పెల్లినాటికి ఆమెకు 13 సంవత్సరాలు వయసు అని తేలింది. ఆమెకు తల్లీదండ్రీ లేరు. దీంతో ఆమె తన నానమ్మ తాతయ్య ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే ఆమెను చెన్నకేశవులు పెళ్ళిచేసుకున్నాడు. ఆమెకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మైనర్ గా ఆమె తేలడంతో పోలీసులు మైనార్టీ తీరేవరకూ బలసదనంలో సంరక్షణలో ఉంచాలని ప్రయత్నించినా ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డా క్షేమం గా ఉన్నారని వైద్యులు చెప్పారు.

Tags:    

Similar News