Mahabubabad: విషాదం.. ఉరేసుకుని దంపతుల బలవన్మరణం
Mahabubabad: గత నెలలో ఇద్దరు కుమార్తెలను హత్యచేసిన దంపతులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో విషాదం నెలకొన్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో అనిల్, దేవి దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెలలో తమ పిల్లలు లోహిత, జశ్వితకు పాలల్లో పురుగు మందు కలిపి హత్య చేసి అనిల్, దేవి దంపతులు పరారయ్యారు.
తాజాగా దంపతులిద్దరు నిర్మానుష్య ప్రాంతంలో ఉరి వేసుకొ ని ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అంకన్నగూడెం అటవీ ప్రాంతానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దంపతుల ఆత్మహత్యకు సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.