బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో కుళ్లిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి. అవార్డులు, రివార్డులు కొనుక్కొని గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలేదని సీఎస్ నివేదిక కూడా స్పష్టం చేసిందన్నారు. విద్యుత్ సంస్థల్లో రిటైర్డ్ అధికారులను తొలగించి ఐఏఎస్ అధికారులను నియమించాలన్నారు.