కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రానికి, దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగాల్సిందేనని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ముఖ్యమంత్రి నిర్ణయం సరైనదని కితాబిచ్చారు.
కరోనాను పూర్తిగా అరికట్టాలంటే లాక్ డౌన్ ను మరిన్ని రోజులపాటు కొనసాగించాల్సిందేనని విజయశాంతి చెప్పారు. మధ్యలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) April 6, 2020