Arvind Dharmapuri: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం

Arvind Dharmapuri: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.

Update: 2024-05-10 11:30 GMT

Arvind Dharmapuri: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం

Arvind Dharmapuri: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అలా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ పార్టీ తొందరగా కూలిపోవాలని మొక్కి వెళ్లి ఓటేయాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి తలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశం మొత్తంలో కాంగ్రెస్ రెండు రాష్టాల్లో ఉంది అది కూడా ఎక్కువ రోజులు ఉండదన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేయాలని ఉగ్రవాద సంస్థలు లెటర్స్ రాస్తున్నాయని అర్వింద్ అన్నారు. 

Tags:    

Similar News