TS Congress: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్
Congress: తమకు ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ
TS Congress: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్
TS Congress: అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. సమావేశాలకు వెళ్లకుండా సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చున్నారు. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు. తమకు ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుంటే.. అది వినడానికే సభకు వచ్చినట్లు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్ చేశారు.