Telangana: పొలిటికల్ ట్విస్ట్.. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana: బీజేపీ నుంచి మహబూబ్నగర్ ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి
Telangana: పార్లమెంట్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనును మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ నుంచి మహబూబ్నగర్ సీటు ఆశించిన జితేందర్ రెడ్డికి బీజేపీ మొండిచేయి చూపింది. ఆ సీటును డీకే అరుణకు కేటాయిస్తున్నట్టు నిన్న ప్రకటించగా... తాజాగా సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.