CM KCR: నిజామాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్
CM KCR: ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష
CM KCR: నిజామాబాద్ జిల్లాపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సహా.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతులు మెరుగుపర్చడం, అన్ని రంగాలను అభివృద్ధి పర్చడం, నిజామాబాద్ను సుందరంగా తీర్చిదిద్దే కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అప్పటికప్పుడే సీఎం కేసీఆర్.. సంబంధిత అధికారులను ఆదేశించారు.