ఆర్టీసీ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాల్లోకి తీసుకోం..వారికి మాత్రమే జీతాలు..

Update: 2019-10-12 10:56 GMT

సమ్మె చేస్తున్న వారితో ఎలాంటి చర్చలు జరపడానికి వీళ్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ విధులకు గైర్హాజరైన వారిని ఎట్టిపరిస్థితుల్లో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను మరోవారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్‌ మాసం జీతాలు చెల్లించాలని ఆదేశించారు.

Tags:    

Similar News