Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. అతనే నిందితుడు..
Chevella Bus Accident: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Chevella Bus Accident: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. టిప్పర్ యజమానిని పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ఓవర్లోడ్తో ఉన్న టిప్పర్ను డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేల్చారు.
ఈ కేసులో టిప్పర్ యజమాని లచ్చునాయక్ని తాజాగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాదంలో గాయపడ్డ అతడు ఇంకా కోలుకోలేదు. పూర్తిగా కోలుకున్నాకే విచారిస్తామని పోలీసులు తెలిపారు. నవంబరు 3న వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బస్సులోని 18 మంది, టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు.