హైదరాబాద్ గాలిలో కరోనా వైరస్ : సీసీఎంబీ అధ్యయనంలో బయటపడ్డ సంచలన విషయాలు
కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్న సీసీఎంబీ కీలక విషయాలు వెల్లడించింది. ఆసుపత్రుల్లో గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్, మోహాలీ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన సీసీఎంబీ ఈ విషయాలను ప్రకటించింది. అయితే ప్రజలు ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చిన స్పష్టం చేశారు.