PM Modi: నేడు నాగర్కర్నూల్కు మోడీ .. భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు
PM Modi: ఉదయం 11గంటలకు నాగర్కర్నూల్ బయలుదేరనున్న మోడీ
PM Modi: ప్రధాని మోడీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం రాజ్భవన్లో బస చేసిన ప్రధాని మోడీ ఉదయం 11గంటలకు నాగర్కర్నూల్ బయలుదేరనున్నారు. ఉదయం 11:45 నుంచి 12:45 వరకు అక్కడ నిర్వహించే సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గాకువెళ్లనున్నారు. తిరిగి మళ్లీ 18వ తేదీన ఆయన రానున్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు.