Balapur Laddu 2025: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ – ఈసారి 35 లక్షలు!

Balapur Laddu 2025: హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ ఈసారి మరోసారి రికార్డు ధర పలికింది. కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

Update: 2025-09-06 06:26 GMT

Balapur Laddu 2025: హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ ఈసారి మరోసారి రికార్డు ధర పలికింది. కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కంటే దాదాపు రూ. 5 లక్షలు ఎక్కువగా ధర పలకడం విశేషం.

వేలం రూ. 1,116 నుంచి ప్రారంభమైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో 38 మంది పాల్గొన్నారు. వీరిలో 31 మంది గతంలో కూడా వేలంలో పాల్గొన్నవారే కాగా, కొత్తగా ఏడుగురు లడ్డూ బిడ్డింగ్‌లో అడుగుపెట్టారు. చివరికి లింగాల దశరథ్ గౌడ్ లడ్డూను గెలుచుకుని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి మొత్తం డబ్బును అందజేశారు.

గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 31 ఏళ్లు పూర్తి చేసుకుంది.

1994లో తొలిసారిగా ఈ వేలం నిర్వహించగా, అప్పట్లో కొలను మోహన్ రెడ్డి కేవలం రూ. 450కే లడ్డూను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లడ్డూ ధరలు ఎగబాకుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి.

లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్ మాట్లాడుతూ – “గత ఆరేళ్లుగా నేను ఈ వేలంలో పాల్గొంటున్నాను. ఈసారి లడ్డూ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది గణపయ్య దయ వల్లే సాధ్యమైంది” అని తెలిపారు.

బాలాపూర్ లడ్డూ వేలం ధరల చరిత్ర


సంవత్సరం ఎవరు గెలుచుకున్నారు ధర (రూ.)
1994 కొలను మోహన్ రెడ్డి 450
1995 కొలను మోహన్ రెడ్డి 4,500
1996 కొలను కృష్ణారెడ్డి 18,000
1997 కొలను కృష్ణారెడ్డి 28,000
1998 కొలను మోహన్ రెడ్డి 51,000
1999 కల్లెం అంజి రెడ్డి 65,000
2000 కల్లెం ప్రతాప్ రెడ్డి 66,000
2001 రఘునందన్ చారి 85,000
2002 కందాడ మాధవరెడ్డి 1,05,000
2003 చిగిరింత బాల్‌రెడ్డి 1,55,000
2004 కొలను మోహన్ రెడ్డి 2,01,000
2005 ఇబ్రహీం శేఖర్ 2,80,000
2006 చిగిరింత తిరుపతి రెడ్డి 3,00,000
2007 రఘునందన్ చారి 4,15,000
2008 కొలను మోహన్ రెడ్డి 5,07,000
2009 సరిత 5,10,000
2010 కొడాలి శ్రీధర్ బాబు 5,35,000
2011 కొలను బ్రదర్స్ 5,45,000
2012 పన్నాల గోవర్థన్ రెడ్డి 7,50,000
2013 తీగల కృష్ణారెడ్డి 9,26,000
2014 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000
2015 కొలను మదన్ మోహన్ రెడ్డి 10,32,000
2016 స్కైలాబ్ రెడ్డి 14,65,000
2017 నాగం తిరుపతి రెడ్డి 15,60,000
2018 శ్రీనివాస్ గుప్తా 16,60,000
2019 కొలను రామిరెడ్డి 17,60,000
2020 కరోనా కారణంగా అప్పటి సీఎం కేసీఆర్‌కి అందజేశారు -
2021 రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి 18,90,000
2022 వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000
2023 దాసరి దయానంద్ రెడ్డి 27,00,000
2024 కొలను శంకర్ రెడ్డి 30,01,000
2025 లింగాల దశరథ్ గౌడ్ 35,00,000


Tags:    

Similar News