ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన బాలకృష్ణ
Balakrishna: నివాళులర్పించిన రామకృష్ణ, సుహాసిని, కుటుంబసభ్యులు
ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన బాలకృష్ణ
Balakrishna: దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు సుహాసిని, కుటుంబసభ్యులు ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. భూమ్మీద ఎంతమంది పుట్టినా అందరూ మహానుభావులు కాలేరన్నారు. మహానుభావులకు చావు పుట్టుకలతో సంబంధం ఉండదన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభమని అన్నారు. ఎన్టీఆర్ నవ యువతకు మార్గదర్శకుడు అని కొనియాడారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరిస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.