శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. అక్కడే గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాలకు పోస్టుమార్టం నిర్వహించి శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.