Secunderabad: స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

Secunderabad: సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ వద్ద ఏబీవీపీ బైటాయింపు

Update: 2024-02-07 08:25 GMT

Secunderabad: స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

Secunderabad: విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఏబీవీపీ ధర్నాకు దిగింది. క్లాక్ టవర్ వద్ద విద్యార్థులు భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించింది. విద్యార్థులకు క్రీడా సామాగ్రితో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా.... కనీసం యూనివర్సిటీల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు.

Tags:    

Similar News