అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం పున: ప్రారంభం
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన సంఘటన జరిగి 24 రోజులు గడుస్తుంది.
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన సంఘటన జరిగి 24 రోజులు గడుస్తుంది. ఆ ఘటన చోటు చేసుకున్నప్పటినుంచి అబ్దుల్లాపూర్మెట్లోని తహశీల్దార్ కార్యాలయం మూసివేసారు. ఇదిలా ఉండగా ఈ రోజున నూతన తహశీల్దార్ గా బాధ్యతలను వెంకట్ రెడ్డి స్వీకరించారు.
దీంతో ఈ రోజు ఉదయం అధికారులు కార్యాలయాన్ని తెరిచి, శుద్ధి చేసారు. అనంతరం అందులో పూజలు నిర్వహించి వారి పనులను ప్రారంభించారు.