Corona: మనుషుల నుంచి జంతువులకు పాకిన కొవిడ్
Corona: నెహ్రూ జూపార్క్లో 8 సింహాలకు సోకిన కొవిడ్ జూపార్క్లో పనిచేసే సిబ్బందితోనే సింహాలకు కరోనా
నెహ్రు జూ పార్కులోని సింహాలకు కరోనా (ఫైల్ ఇమేజ్)
Corona: ఇప్పటి వరకు మనుషుల పైన తీవ్ర ప్రభావం చూపిన కరోనా.. ఇప్పుడు జంతువులపై కూడా చూపిస్తోంది. నెహ్రూ జులాజికల్ పార్క్లో సింహాలపై సైతం కొవిడ్ అటాక్ కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జూ పార్క్లో 8 సింహాలు ఆహారం తీసుకోకపోవడం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తూ పాజిటివ్గా నిర్దారణ అయినట్టు సీసీఎంబీ ప్రకటించింది. జూ పార్క్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సింహాలకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. లక్షణాలు వచ్చిన తర్వాత సిబ్బందికి టెస్ట్ చేయగా 30 మందికి పాజిటివ్గా తేలింది. వాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్ జంతువులను సైతం వెంటాడుతుంది.