Sports Updates Today: భారత్ మహిళల అద్భుత విజయం..చైనా ఒలింపిక్స్ కు మరో దేశం షాక్..

Sports Updates Today: క్రీడా ప్రపంచంలో ముఖ్యాంశాలు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం...

Update: 2021-12-15 04:04 GMT

Sports Updates Today: భారత్ మహిళల అద్భుత విజయం..చైనా ఒలింపిక్స్ కు మరో దేశం షాక్..

Sports Updates Today: ఒక పక్క చైనా ఒలింపిక్స్ విషయంలో బీజింగ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు భారత మహిళా ఫుట్ బాల్ జట్టు తన సత్తా చాటింది.. భారత సెయిలింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది.. మరోవైపు, కరోనా వైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. కరోనా కారణంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో మరో మ్యాచ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇటువంటి క్రీడా ప్రపంచంలో ముఖ్యాంశాలు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. డిసెంబర్ 14 నాటి టాప్ క్రీడా విశేషాల మాలిక ఇది.

చైనాకు ఆస్ట్రియా నుంచి గట్టి దెబ్బ..

బీజింగ్ వింటర్ గేమ్స్‌కు తమ దేశంలోని పెద్ద రాజకీయ నాయకుడు ఎవరూ వెళ్లరని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమర్ అన్నారు. అయితే, చైనాలో కరోనా వైరస్ నియంత్రణల కారణంగా ఇది జరుగుతుందని, ఇది దౌత్యపరమైన నిరసన కాదని ఆయన అన్నారు. జర్మనీ దినపత్రిక డై వెల్స్‌లో ఛాన్సలర్ నెహమర్ మంగళవారం ఈ వ్యాఖ్య చేశారు. అంతకుముందు, ఆస్ట్రియా, అనేక ఇతర ఈయూ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు చైనా పేలవమైన మానవ హక్కుల రికార్డు గురించి ఆందోళనలను లేవనెత్తుతూ, గేమ్‌లను దౌత్యపరమైన బహిష్కరణకు అమెరికా ఇచ్చిన పిలుపులో చేరడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగనుంది

పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవ వేడుక ప్రత్యేకంగా ఉంటుంది, వేలాది మంది అథ్లెట్లు సీన్ నదిలో పడవలపై చేసే విన్యాసాలు.. ఈఫిల్ టవర్ వెనుక సూర్యుడు అస్తమించడంతో భారీ బంగారు పతకాన్ని పొందే సన్నివేశం ఇలాంటి అద్భుత దృశ్యాలకు నేఅల్వు కానుంది. సోమవారం జరిగిన ఒక వేడుకలో పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు.

నది ఒడ్డున వేలాది మంది ఉచితంగా వీక్షించేలా ఒలింపిక్ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రారంభ వేడుకలు సాధారణంగా స్టేడియం లోపల నిర్వహిస్తారు. అయితే, పారిస్ ఆర్గనైజింగ్ కమిటీ భిన్నంగా చేయాలని ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ వేడుక జూలై 26, 2024న నిర్వహిస్తారు. ఇందులో వెలుగుల నగరం సంస్కృతి ముఖ్య లక్షణం కూడా కనిపిస్తుంది. మొత్తం 200 జట్లకు చెందిన ఆటగాళ్ల పరేడ్‌తో వేడుక ప్రారంభమవుతుంది.

మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ఏకపక్ష విజయం

సోమవారం జరిగిన సాఫ్(SAFF)అండర్-19 మహిళల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంకను 5-0తో ఓడించి భారత జట్టు తన ప్రచారాన్ని అద్భుతంగా ప్రారంభించింది. భారత్ తరఫున నీతూ లిండా (9వ, 41వ నిమిషాలు) రెండు గోల్స్‌ చేసింది. వీరితో పాటు సంతోష్ (రెండో), కరెన్ ఆస్ట్రోసియో (ఐదో), ప్రియాంక దేవి (82వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు. తొలి 10 నిమిషాల్లోనే మూడు గోల్స్‌ చేసి చివరి వరకు కోలుకోనీయకుండా.. భారత జట్టు శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టింది. హాఫ్ టైం వరకు భారత్ 4-0తో ఆధిక్యంలో ఉంది. భారత డిఫెన్స్ కూడా చక్కటి ఆటతీరును ప్రదర్శించి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

కరోనా కారణంగా EPL మ్యాచ్ వాయిదా

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ సందర్భంగా పెరుగుతున్న కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల కారణంగా మాంచెస్టర్ యునైటెడ్.. బ్రెంట్‌ఫోర్డ్ మధ్య మ్యాచ్ వాయిదా పడింది. గత మూడు రోజుల్లో వాయిదా పడిన రెండో మ్యాచ్ ఇది. ఆదివారం వరకు, 3805 మంది ఆటగాళ్లు.. క్లబ్ సిబ్బందిని విచారించిన తర్వాత 42 కేసులు నమోదయ్యాయి. అంటే, గత ఏడు రోజుల్లో 12 కేసులు పెరిగాయి. నార్విచ్‌పై 1-0 విజయం తర్వాత , కొంతమంది యునైటెడ్ ప్లేయర్‌లు.. సిబ్బంది పాజిటివ్‌గా పరీక్షించారు . ఈ కారణంగా మంగళవారం మ్యాచ్‌ను వాయిదా వేయాలన్న యునైటెడ్ అభ్యర్థనను ప్రీమియర్ లీగ్ బోర్డు అంగీకరించింది. టోటెన్‌హామ్, బ్రైటన్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కూడా కనీసం ఎనిమిది మంది ఆటగాళ్లు కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు తేలడంతో వాయిదా పడింది. నార్విచ్.. ఆస్టన్ విల్లా జట్లలో కూడా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

భారత సెయిలింగ్ ఆటగాళ్లకు శుభవార్త

క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల పునర్నిర్మించిన మిషన్ ఒలింపిక్ సెల్ (MOC) చైనాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా విదేశాల్లో వ్యాయామాలు, పోటీలలో పాల్గొనేందుకు నలుగురు సెయిలింగ్ ఆటగాళ్ల ప్రతిపాదనను ఆమోదించింది. నలుగురు ఒలింపియన్ల ప్రతిపాదనకు మూడున్నర కోట్ల రూపాయలకు పైగానే ఖర్చవుతుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఆటగాళ్లలో 49ER స్పెషలిస్ట్‌లు వరుణ్ ఠక్కర్, కేసీ గణపతి ( రూ 1 కోటి 34 లక్షలు ) , లేజర్ రేడియల్ స్పెషలిస్ట్ నేత్ర కుమనన్ ( రూ 90.58 లక్షలు ) లేజర్ స్టాండర్డ్ స్పెషలిస్ట్ విష్ణు శరవణన్ ( రూ 51.08 లక్షలు ) ఉన్నారు . ఈ డబ్బు వారి ప్రయాణం, వసతి, కోచ్ ఎంట్రీ ఫీజు, కోచ్ బోట్ చార్టర్.. కోచ్ జీతం కోసం ఖర్చు చేస్తారు.

Tags:    

Similar News