T20 World Cup 2026 Final: వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ట్విస్ట్.. టీమ్ ఇండియా బస చేసే హోటల్ మార్పు

T20 World Cup 2026 Final: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 క్లైమాక్స్ వచ్చేసింది.

Update: 2026-03-07 07:38 GMT

T20 World Cup 2026 Final: వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ట్విస్ట్.. టీమ్ ఇండియా బస చేసే హోటల్ మార్పు

T20 World Cup 2026 Final: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 క్లైమాక్స్ వచ్చేసింది. రేపు (ఆదివారం) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం క్రికెట్ మేనియాతో ఊగిపోతోంది.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా బస చేసే హోటల్‌ను బీసీసీఐ (BCCI) చివరి నిమిషంలో మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. భద్రతా కారణాలా లేక మరేదైనా కారణమా అన్నది స్పష్టత లేదు. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, క్రీడా వర్గాల్లో ఈ మార్పు చర్చనీయాంశంగా మారింది.

అభిమానుల కోసం ప్రత్యేక రైళ్లు:

ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు. విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో పశ్చిమ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సామాన్య క్రికెట్ ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చింది.

విమానయాన సంస్థల స్పెషల్ సర్వీసెస్:

డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు అదనపు విమానాలను ప్రకటించాయి.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.

ఆకాశ ఎయిర్: మార్చి 8, 9 తేదీల్లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక విమానాలను అందుబాటులోకి తెచ్చింది.

వేల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి చేరుకోనుండటంతో అహ్మదాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరి స్వదేశీ గడ్డపై టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.


Tags:    

Similar News