PV Sindhu: తెలుగు రాష్ట్రాలకు పీవీ సింధు విరాళం

Update: 2020-03-26 10:47 GMT

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటానికి తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్ లో వెల్లడించింది.





Tags:    

Similar News