జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్

PV Sindhu-Srikanth: రెండో రౌండ్ లోకి ప్రవేశించిన సింధు, శ్రీకాంత్

Update: 2022-03-09 01:07 GMT

జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్

PV Sindhu-Srikanth: జర్మనీలో జరుగుతున్న జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ శుభారంభం చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. థాయ్ లాండ్ కు చెందిన బుసానస్ పై 21-8, 21-7 వరుస సెట్లలో విజయం సాధించింది. సింధు తన తర్వాతి మ్యాచ్ లో స్పెయిన్ కి చెందిన బియట్రిజ్ కొరలెస్ తో గానీ, చైనా కు చెందిన ఝాంగ్ యి మన్ తో తలపడే అవకాశం ఉంది.

కిదాంబి శ్రీకాంత్ మరో మ్యాచ్ లో ఫ్రాన్స్ కి చెందిన ప్రత్యర్థిని ఓడించాడు. ఈ మ్యాచులో శ్రీకాంత్ 21-10, 13-21, 21-7 తేడాతో గెలుపొందారు. తర్వాతి మ్యాచ్ లో చైనాకు చెందిన క్రీడాకారుడితో తలపడనున్నాడు.  

Tags:    

Similar News