జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో అదరగొట్టిన ఆంధ్రా అమ్మాయిలు

జాతీయ అథ్లెటిక్ పోటీల్లో ఆంద్ర ప్రదేశ్ అమ్మాయిలు ఆదరగొడుతున్నారు.

Update: 2019-08-31 02:58 GMT

లక్నోలో జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రాణించారు. 100మీ. హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజి విజేతగా నిలిచింది. ఆమె 13.91సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్‌ 5321 పాయింట్లతో పసిడి పతకాన్ని అందుకుంది.

ఇక ఒడిశా క్రీడాకారిణి ద్యుతిచంద్ ఈ పోటీల్లో చక్కని ప్రదర్శన కనపర్చింది. శుక్రవారం నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో 11.38 సెకన్లలో తన పరుగును పూర్తి చేసి స్వర్ణ పతాకాన్ని గెలుచుకుంది.


Tags:    

Similar News