Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌.. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్

Hyderabad: ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు టీమ్‌లు

Update: 2023-04-01 08:23 GMT

Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌.. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్

Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయిపోయింది. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు టీములు హైదరాబాద్ చేరుకున్నాయి. ఇక.. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రాక్టీస్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు.. వారం ముందే అమ్ముడుపోయాయి. ఇక.. ఈ మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు సీపీ చౌహాన్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. స్టేడియం మొత్తం నిఘాలో ఉంటుందని స్పష్టం చేశారు సీపీ చౌహాన్. కాగా.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచులు జరుగనున్నాయి.

Tags:    

Similar News