India vs England 1st Test: ధాటిగా ఆడుతున్న పంత్

Update: 2021-02-07 09:45 GMT

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఛెతేశ్వర్‌ పుజారా(62; 131 బంతుల్లో 10x4), రిషభ్‌ పంత్‌(68; 65 బంతుల్లో 7x4, 4x6) అర్ధశతకాలు సాధించారు. అంతకుముందు 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును పంత్‌, పుజారా ఆదుకుంటున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ ఇప్పటికి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 50వ ఓవర్ లో ఇద్దరూ హాఫ్ సెంచరీ సాధించారు. 49 ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోర్‌ 188/4గా నమోదైంది. 

Tags:    

Similar News