IND vs NZ: ఇండోర్ చేరుకున్న భారత్, కివీస్ ఆటగాళ్లు
IND vs NZ: ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇండోర్ చేరుకున్నారు. మంగళవారం భారత్, కివీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇండోర్ చేరుకున్నారు. రేపట్నుంచి ప్రాక్టీస్ మొదలుపట్టనున్నాయి. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డేలో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. తొలి వన్డేలో కొంతమేర పోటినిచ్చిన కివీస్ రెండో వన్డేలో అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నారు.