టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ఫుల్ డిమాండ్!

Update: 2019-08-01 08:53 GMT

టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారత్ జట్టు హెడ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు ఫిజియో, కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్క ప్రధాన కోచ్ పదవికి 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.

ఇక ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా, ఈ పదవి రేసులో రావిశాస్త్రి తో పాటు రాబిన్ సింగ్, మహేలా జయవర్దనే, మైక్ హసన్, టామ్ మూడీ పేర్లు మాత్రమే పోటీలో ఉన్నట్టు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ కోచ్ రేసులో సంజయ్ భంగర్, ప్రవీణ్ ఆమ్రే ల మధ్య పోటీ ఉంది. ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ దఖాస్తూ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.


Tags:    

Similar News