టాప్ లోకి దూసుకొచ్చిన డిల్లీ దబంగ్

Update: 2019-08-29 05:15 GMT

 ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో దబంగ్‌ ఢిల్లీ వరుస విజయాలు సాధిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ని ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది. ఈ మ్యచ్ లో ఢిల్లీ 40–24తో యు ముంబా పై ఘనవిజయం సాధించింది. ఢిల్లీ తరఫున రైడర్‌ నవీన్‌ 21 సార్లు కూతకెళ్లి 9 సార్లు 11 పాయింట్లు తెచ్చి ఢిల్లీ విజయం లో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్లలో రవీందర్‌ (8) ప్రత్యర్థి రైడర్లను ఊపిరి తీసుకోనీయలేదు. మిగతా వారిలో జోగిందర్‌ నర్వాల్‌ (6), చంద్రన్‌ రంజీత్‌ (4), బలరామ్‌ (2) రాణించారు


Tags:    

Similar News