CM Mamata Banerjee: సువేందు గెలుపుపై హైకోర్టులో దీదీ సవాల్

Nandigram Election Results 2021: పశ్చిమబెంగాల్‌ నందిగ్రామ్‌ ఎన్నిక రగడ చివరి దశకు చేరుకుంది.

Update: 2021-06-18 07:37 GMT

Nandigram: సువేందు గెలుపుపై హైకోర్టులో దీదీ సవాల్

CM Mamata Banerjee: పశ్చిమబెంగాల్‌ నందిగ్రామ్‌ ఎన్నిక రగడ చివరి దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పిటిషన్‌ను జస్టిస్‌ కౌశిక్‌ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 'హ్యాట్రిక్‌' విజయం అందించిన దీదీ నందిగ్రామ్‌లో 1700 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

మే 3న కౌంటింగ్‌ జరిగే సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్లు డౌన్‌ అయినట్లు మమతా ఆరోపిస్తున్నారు. గవర్నర్‌ కూడా తాను గెలిచినట్టుగా అభినందనలు తెలిపారని, అకస్మాత్తుగా అంతా మారిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమె సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ నేడు విచారణకు రానుంది.

Tags:    

Similar News