కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!

Ravi Shankar Prasad's helicopter : కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయన ప్రయాణిస్తున్నహెలికాప్టర్ బీహార్ రాజధాని పాట్నాలొ ప్రమాదానికి గురైంది. కరెంట్ తీగలకు తగలడం వలన హెలికాప్టర్ రెక్కలు విరిగిపోయాయి.

Update: 2020-10-17 15:44 GMT

Ravi Shankar Prasad's helicopter : కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయన ప్రయాణిస్తున్నహెలికాప్టర్ బీహార్ రాజధాని పాట్నాలొ ప్రమాదానికి గురైంది. కరెంట్ తీగలకు తగలడం వలన హెలికాప్టర్ రెక్కలు విరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి బయటపడ్డారు. బీహార్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హెలికాప్టర్ లో రవిశంకర్ ప్రసాద్ తో పాటుగా బీహార్ మంత్రి మంగళ్ పాండే, సంజయ్ ఝూ కూడా ఉన్నారు. ఈ ఘటనపై రవిశంకర్ ప్రసాద్ కార్యాలయం స్పందించింది. మంత్రి రవిశంకర్ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడానికి మంత్రి బీహార్‌లో ఉన్నారు. నిన్న అయన మధుబని జిల్లా లాఖా నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మరోసారి, బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయబోతున్నారని ట్వీట్ చేశారు. 


Tags:    

Similar News