Union Budget 2021 : ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం

Update: 2021-01-05 11:56 GMT

Union Budget 2021 : ఈనెల 29నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈనెల 29వ తేదీ నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభంకానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్త‌వానికి గ‌త ఏడాది క‌రోనా వైర‌స్ వ‌ల్ల శీతాకాల స‌మావేశాలను ర‌ద్దు చేశారు. అంతే కాదు, గ‌త ఏడాది వ‌ర్షాకాల స‌మావేశాల‌ను అర్ధాంత‌రంగా ముగించారు. జ‌న‌వ‌రి 29వ తేదీన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేయ‌నున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు తొలి ద‌ఫా స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు రెండవ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Full View


Tags:    

Similar News