Tamil Nadu Polls: అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల.. తొలిజాబితాలో హేమాహేమీలు

Update: 2021-03-05 14:22 GMT

అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల.. తొలిజాబితాలో హేమాహేమీలు

Tamil Nadu Polls: తమిళనాడులో పార్టీలన్నీ బరిలో నిలిచే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వే షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. థెన్ మొళిలకు తొలి జాబితాలో స్థానం లభించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగతా అభ్యర్థులను మరికొన్నిరోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి.

Tags:    

Similar News