మమతకు పోటీగా సువేందును బరిలో దించే ఛాన్స్

Update: 2021-03-04 14:44 GMT

మమతకు పోటీగా సువేందును బరిలో దించే ఛాన్స్

నందిగ్రామ్‌ నియోజకవర్గానికి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా బెనర్జీ ఈనెల 11న నందిగ్రామ్‌లో తన నామినేషన్ వేయనున్నారు. శివ భక్తురాలైన మమతా బెనర్జీ శివరాత్రి రోజును నామినేషన్ వేసేందుకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్గెస్ట్‌ బాటిల్‌గా నిలవనున్న ఈ నియోజకవర్గంలో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్యే హోరాహోరీ పోటీ జరగనుంది. టీఎంసీ నుంచి రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన సువేందును మమతాకు పోటీగా దించాలని బీజేపీ భావిస్తోంది. దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు జరుపుతోంది.

Tags:    

Similar News