Rahul Gandhi: మోడీ విధానాలతో బడా కార్పొరేట్లకే ప్రయోజనం..

Rahul Gandhi: బీజేపీ పాలనలో దేశంలో భయం, ద్వేషం పెరిగిందని.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Update: 2022-09-04 10:15 GMT

Rahul Gandhi: మోడీ విధానాలతో బడా కార్పొరేట్లకే ప్రయోజనం..

Rahul Gandhi: బీజేపీ పాలనలో దేశంలో భయం, ద్వేషం పెరిగిందని.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆయన మోడీ ప్రభుత్వ విధానాలన్నీ బడా పారిశ్రామిక వేత్తలకే లబ్ది చేకూరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో పేదలు, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తే వారి గళాన్ని కేంద్రం అణచివేస్తోందని మండిపడ్డారు. మీడియా, ఎన్నికల సంఘం వంటి స్వత్రంత్ర వ్యవస్థలపైనా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని పేర్కొంటూ అటువంటివాటిపైనా దాడులు చేస్తోందని కేంద్రం తీరుపై రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News