Ram Nath Kovind: ప్రత్యేక రైలులో సొంత ఊరికి రాష్ట్రపతి ప్రయాణం

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సొంత ఊరైన కాన్ పూర్ కు రైలు ప్రయాణం చేస్తున్నారు.

Update: 2021-06-25 10:29 GMT

Ram Nath Kovind: ప్రత్యేక రైలులో సొంత ఊరికి రాష్ట్రపతి ప్రయాణం

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సొంత ఊరైన కాన్ పూర్ కు రైలు ప్రయాణం చేస్తున్నారు. ఢిల్లీ సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్ట్రపతి కాన్పూర్ లోని తన జన్మస్థలమైన పరౌంఖ్ లో పర్యటిస్తారు. ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగుతుంది. అక్కడ తన చిన్న నాటి స్నేహితులను, స్కూలు క్లాస్ మేట్స్ ను ఆయన పలకరిస్తారు. 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నాక సొంత ఊరికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈనెల 29న పరౌంఖ్ లో ఆయనను స్థానికులు సన్మానించనున్నారు. అనంతరం లక్నోలో పర్యటించనున్న రాష్ట్రపతి ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రయాణం కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News