రాష్ట్రపతితో ప్రధాని మోడీ సమావేశం.. పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా..

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.

Update: 2022-01-06 09:17 GMT

రాష్ట్రపతితో ప్రధాని మోడీ సమావేశం.. పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా..

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అటు ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు పంజాబ్‌ సర్కార్‌ కూడా భద్రతా ఉల్లంఘనలపై హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రధానికి ఫోన్‌ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నిన్న పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన మోడీని నిరసన కారులు అడ్డుకోవడంతో.. ఒక ఫైఓవర్‌పై 20 నిముషాలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కువచ్చేశారు.

Tags:    

Similar News