PM Modi: సోనియాజీ.. మీరు త్వరగా కోలుకోవాలి..

PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

Update: 2022-06-02 15:04 GMT

PM Modi: సోనియాజీ.. మీరు త్వరగా కోలుకోవాలి..

PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. సోనియాకు కరోనా సోకడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కొవిడ్-19 నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు. కాగా, సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. మరోవైపు సోనియా ఈ నెల 8న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నప్పటికీ, కోలుకుని విచారణకు హాజరవ్వాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం.


Tags:    

Similar News