Pariksha Pe Charcha 2026: "పరీక్షలంటే భయం వద్దు.. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం!" - విద్యార్థులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

Pariksha Pe Charcha 2026: బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వ ఏడాది 'పరీక్షా పే చర్చ' నిర్వహించారు.

Update: 2026-02-06 06:43 GMT

Pariksha Pe Charcha 2026: బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వ ఏడాది 'పరీక్షా పే చర్చ' నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 'ఎగ్జామ్ వారియర్స్'తో ముచ్చటించిన ప్రధాని, పరీక్షల ప్రిపరేషన్ మరియు ఒత్తిడి నిర్వహణపై కీలక సూచనలు చేశారు.

పరీక్షల కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రిపరేషన్ పద్ధతిని అనుసరిస్తుంటారని, ఇతరుల సలహాలు విన్నా.. చివరకు తమకు ఏది సులభంగా, అనువుగా ఉంటుందో ఆ పద్ధతినే ఎంచుకోవాలని ప్రధాని సూచించారు. సలహాలను స్వీకరించండి, కానీ మీకు వ్యక్తిగతంగా ఏది పనికొస్తుందో దానిపైనే నమ్మకం ఉంచండి. రకరకాల ప్రిపరేషన్ టిప్స్ గురించి అతిగా ఆలోచించి ఒత్తిడికి గురికావద్దని ప్రధాని హెచ్చరించారు.

బలమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే విజయం సాకారం అవుతుందని మోదీ స్పష్టం చేశారు. "పరీక్షలు మీ జ్ఞానానికి పరీక్ష మాత్రమే, మీ జీవితానికి కాదు" అని చెబుతూ, పరీక్షలను ఒక పండుగలా (Utsav) సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమైన ముఖ్యాంశాలు:

2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా 9వ ఏట అడుగుపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 4.5 కోట్ల మంది విద్యార్థులు ఈ చర్చ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి ఢిల్లీతో పాటు కోయంబత్తూర్, గువహటి, రాయ్‌పూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వర్చువల్‌గా పాల్గొన్నారు.  ఏఐ (AI) వంటి సాంకేతికతను జ్ఞానాన్ని పెంచుకోవడానికి వాడాలి తప్ప, దానికి బానిసలు కావద్దని ప్రధాని హితవు పలికారు.

Tags:    

Similar News