PM Kisan: రైతులు అలర్ట్‌.. ఈ పని చేయకపోతే పదకొండో విడత డబ్బులు రావు..

PM Kisan: ప్రస్తుతం రైతులు పీఎం కిసాన్ యోజన 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

Update: 2022-03-03 09:30 GMT

PM Kisan: రైతులు అలర్ట్‌.. ఈ పని చేయకపోతే పదకొండో విడత డబ్బులు రావు..

PM Kisan: ప్రస్తుతం రైతులు పీఎం కిసాన్ యోజన 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం10 విడతలు రైతుల ఖాతాలకు చేరాయి. అయితే PM కిసాన్ యోజన 2021లో కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. దీని ప్రకారం రైతులు 11వ విడత కోసం e-KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 11వ విడతకు సంబంధించి అనేక కొత్త నిబంధనలతో రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు e-KYCని పూర్తి చేసినప్పుడు మాత్రమే PM కిసాన్ యోజన లబ్ధిదారులు 11వ విడత డబ్బు పొందుతారు. e-KYC లేకుండా మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయే అవకాశం ఉంది. త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత విడుదల కానుంది. ఆధార్ ఆధారిత ఓటీపీ ప్రమాణీకరణ కోసం రైతులు కిసాన్ కార్నర్‌లోని e-KYC ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించాలి. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కూడా ఈ పని చేయవచ్చు.

1. ఆధార్ ఆధారిత OTP ప్రమాణీకరణ కోసం కిసాన్ కార్నర్‌లో 'EKYC' ఎంపికపై క్లిక్ చేయండి.

2. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించండి.

3. మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కూర్చొని పూర్తి చేయవచ్చు.

4. దీని కోసం, మీరు ముందుగా https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి.

5. కుడి వైపున ట్యాబ్‌లను చూస్తారు. ఎగువన మీరు e-KYC అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

6. అడిగిన వివరాలు అందించి పూర్తి చేయండి.

జాబితాలో మీ పేరును ఇలా తెలుసుకోండి

1. దీని కోసం, ముందుగా మీరు PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in కి వెళ్లండి.

2. ఇప్పుడు హోమ్‌పేజీలో మీరు ఫార్మర్స్ కార్నర్ ఎంపికను చూస్తారు.

3. ఫార్మర్స్ కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు డ్రాప్ డౌన్ జాబితా నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.

5. దీని తర్వాత మీరు 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి.

6. తర్వాత లబ్ధిదారుల పూర్తి జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరును తనిఖీ చేసుకోండి.

Tags:    

Similar News