రాజ్యసభ సభ్యుల ఎంపికపై జనసేనాని హర్షం

Pawan Kalyan: దేశ ప్రతిష్టను ఇనుమడింప వారిని ఎంపిక చేశారు

Update: 2022-07-08 01:26 GMT

రాజ్యసభ సభ్యుల ఎంపికపై జనసేనాని హర్షం

Pawan Kalyan: సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్, మ్యాస్ట్రో ఇళయరాజా, పరుగులరాణి పీటీ ఉష, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి, ప్రముఖ సామాజికవేత్త వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందం కలిగించిందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నానని తెలిపారు. రాజ్యసభకు నామినేట్ అయిన వారంతా తమ రంగాల్లో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే వారని పవన్ కీర్తించారు. వీరి సేవలు, అనుభవాన్ని గుర్తించిన ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

Tags:    

Similar News