దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌

Update: 2021-02-22 13:28 GMT

దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. 2016లో ఎంఐఎంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత హుస్సేన్ అన్వర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. విచారణకు హజరు కానందున దిగ్విజయ్ సింగ్ పై ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్ చేసిన అభ్యర్దనను కోర్టు తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

Tags:    

Similar News