New IT Rules: కొత్త ఐటీ రూల్స్‌పై విచారణలు ఆపలేమన్న సుప్రీం

New IT Rules: కొత్త ఐటీ నిబంధనలపై వివిధ హైకోర్టులో కొనసాగుతున్న విచారణలను నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది.

Update: 2021-07-10 04:37 GMT

సుప్రీంకోర్టు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

New IT Rules: కొత్త ఐటీ నిబంధనలపై వివిధ హైకోర్టులో కొనసాగుతున్న విచారణలను నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది. న్యూ ఐటీ రూల్స్ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ రాష్ట్రాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టే విచారణ చేపట్టాలని కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. ఓటీటీల నియంత్రణపై ఈ నెల 16న విచారణ జరుగుతోందని, ఆ రోజు ఓటీటీ వేదికల అంశంతో పాటు కేంద్రం పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీం చెప్పింది. అయితే అప్పటిదాకా హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలను ఆపేయాలని కేంద్రం తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా దానిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Tags:    

Similar News