LK Advani, MM Joshi No Invite For Ayodhya Event : అడ్వాణీ, జోషికి అందని ఆహ్వానం?

LK Advani, MM Joshi No Invite For Ayodhya Event : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆగస్టు 5 న రామ మందిరం నిర్మాణానికి భూమి

Update: 2020-08-01 16:03 GMT
LK Advani, MM Joshi ( File photo)

LK Advani, MM Joshi No Invite For Ayodhya Event : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఆగస్టు 5 న రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ వేడుక జరగనున్న సంగతి తెలిసిందే.. ఆ వేడుకని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం కోసం వచ్చేవారి కోసం యుపీ ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ వేడుకకి ఎవరెవరు హాజరు కానున్నారు అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా నేపధ్యం కావడంతో అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారని సమాచారం.

ఇక ఇది ఇలా ఉంటే రామమందిర నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన బీజేపీ సీనియర్ లీడర్స్ ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. కరోనా నేపధ్యం కావడం, వయసు రీత్యా నేరుగా ఈ సమావేశానికి ఆహ్వానించడం లేదని, వారు వీడియో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే వెసులుబాటును కల్పిస్తున్నారని సమాచారం. ఇక అటు మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి మరియు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ లకి ఆహ్వానాలు అందాయి.

1,11,000 లడ్డూల తయారీ ;

ఇక ఈ వేడుకకు గాను దేవరాహా హన్స్ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలోని మణి రామ్ దాస్ చావ్ని ఆలయంలో 1,11,000 లడ్డూల తయారు చేస్తున్నారు. పూజా కార్యక్రమానికి హాజరయ్యే అతిధులకు ఈ లడ్డులను అందజేయనున్నారు. అంతేకాకుండా మన దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా ఈ లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News