BJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
Parvesh Verma: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
BJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే..
Parvesh Verma: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీబీఐకి ముఖ్యమంత్రి కేజ్రీవాలే ఉప్పందిస్తూ ఉండవచ్చని, తాము ఆదేశిస్తే దాడులు జరుగుతున్నాయనడం దిగజారుడుతనమని వ్యాఖ్యానించారు. కీలకమైన మంత్రిపదవులను ఇతరులకు అప్పగించిన కేజ్రీవాల్.. అవినీతి మకిల తనకు అంటుకోకుండా జాగ్రత్తపడుతున్నారని, ఒకవేళ జైలుకు వెళ్లినా.. ఆ మంత్రులే వెళ్తారు తప్ప కేజ్రీవాల్ కు ఏమీ కాదన్నారు. కేజ్రీవాల్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు.