Coronavirus: మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌ వినూత్న ప్రచారం

Coronavirus: కరోనాను కంట్రోల్ ‌చేసేందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏ సీఎం చేయని వినూత్న ప్రచారం చేశారు.

Update: 2021-04-06 16:00 GMT

Coronavirus: మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌ వినూత్న ప్రచారం

Coronavirus: కరోనాను కంట్రోల్ ‌చేసేందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏ సీఎం చేయని వినూత్న ప్రచారం చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ప్రచారం చేస్తూ రోడ్‌ షో నిర్వహించారు.

కరోనా కట్టడి భాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కరోనా గైడ్‌లైన్స్ తప్పక పాటించాలని కోరారు. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరం భోపాల్‌లోని గాంధీ విగ్రహం దగ్గర 24 గంటల ఆరోగ్య అభ్యర్థన దీక్ష ప్రారంభించారు ముఖ్యమంత్రి చౌహాన్‌.

Tags:    

Similar News