Fodder Scam Case: బిహార్‌ మాజీ సీఎం లాలూకు భారీ ఊరట

Fodder Scam Case: ఆర్జేడీ దిగ్గజ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లబించింది.

Update: 2021-04-17 16:00 GMT

లాలూ ప్రసాద్ 

Fodder Scam Case: ఆర్జేడీ దిగ్గజ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లబించింది. పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్​కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశుగ్రాసం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో దోషిగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనకు సీబీఐ న్యాయస్థానం జైలు శిక్ష ఖరారు చేసింది. లాలూపై ఉన్న నాలుగు కేసుల్లో మూడింటిలో ఇప్పటికే బెయిల్ వచ్చింది. తాజా బెయిల్​తో జైలు నుంచి విడుదలయ్యేందుకు లాలూకు మార్గం సుగమమైంది.

Tags:    

Similar News