Karnataka: కుంభమేళాకు వెళ్లివచ్చినవారు ఇళ్ళ నుంచి రావద్దు..

Karnataka: హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది.

Update: 2021-04-15 16:15 GMT

Karnataka: కుంభమేళాకు వెళ్లివచ్చినవారు ఇళ్ళ నుంచి రావద్దు..

Karnataka: హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. విధిగా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరింది. కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ట్విటర్లో ఈ సూచన చేశారు. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే భక్తులు తమ రోజూవారీ పనుల కోసం బయటికి రావాలని ఆరోగ్యమంత్రి ట్విటర్‌లో తెలిపారు. ఇదే విషయమై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు.

Tags:    

Similar News